VijayaKumar

May 03 2024, 17:49

వలిగొండ మండల కేంద్రంలో ఏఐవైఎఫ్ 65వ ఆవిర్భావ దినోత్సవం

వలిగొండ మండల కేంద్రంలో ఏఐవైఎఫ్ 65వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సుద్దాల సాయికుమార్... జెండా ఆవిష్కరించారు...

దేశ ప్రజల మధ్య విచ్చిన్నకర వైషమ్యాలను సృష్టిస్తూ మరల అధికారంలోకి రావడానికి నీచ కుయుక్తులు పన్నుతున్న బీజేపీ ని త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ఓడించాలని...విద్య, వైద్యం, ఉపాధి హక్కుల సాధనకై ఏఐవైఎఫ్ నిరంతరం పోరు సల్పిస్తుందని అఖిల భారత యువజన సమాఖ్య 

ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్

ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ స్వాతంత్రోద్యమంలో యువకులను

 దేశ స్వాతంత్రోద్యమంలో యువకులను సమీకరించి వీరోచితమైన పోరాటం చేసిన ఏకైక యువజన సంఘం AIYF. నేటికీ అనేకమైన ఉద్యమాలు చేస్తూ,విద్య, వైద్య వ్యాపారాన్ని రద్దు చేయాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం, పని హక్కును ప్రాధమిక హక్కుగా గుర్తించాలని, సమగ్ర యువజన విధానం కోసం, ప్రకృతి సంపద ప్రజలకే దక్కాలని, భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ ను రూపొందించి, అమలు చేయాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని, దేశ వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని ఏ ఐ వై ఎఫ్ పోరాటాలు చేస్తుందన్నారు. సామాజిక, న్యాయం, లౌకిక వాదన పరిరక్షణ, శాస్త్రీయ సోషలిజం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా శాంతి స్థాపన కోసం, అశ్లీల సాహిత్యం, అశ్లీల సినిమాల నిషేధం కోసం, దేశాన్ని చీల్చడానికి కుట్రలు చేనే వచ్చిన్నకర శక్తులకు వ్యతిరేకంగా, దేశ ఐక్యత, సమైక్యత కోసం AIYF కృషిచేస్తున్నదన్నారు.

అదే విధంగా నేడు దేశ వనరులను యథేచ్ఛగా కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశ యువత ఉద్యమించాలని, ఈ ఎన్నికలు అవినీతికి, అభివృద్ధి కి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా యువత పరిగణించాలని వారు అన్నారు. ప్రజల మధ్య విభేదాలు, మత ఛాందస విధానాలకు వ్యతిరేకిస్తూ యువత ఆలోచనలు మారాలని, రాజకీయాలంటే కార్పొరేట్ శక్తుల ధన ప్రభావం కాదని... ప్రజా సేవకు పాటుపడే నేటి యువత అని చాటి చెప్పే విధంగా యువజనులు ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని అన్నారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ అతుల్ కుమార్ అంజన్ కు ఏఐవైఎఫ్ మండల సమితి సంతాపం

సీపీఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్‌ అతుల్‌ కుమార్‌ అంజన్‌ మరణం, దేశంలో వామపక్షాలకు తీరని లోటని. స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో ఫైర్‌ బ్రాండ్ విద్యార్థి నాయకుల్లో కామ్రేడ్ అతుల్ ఒకరని, ఏ ఐ ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం లో జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారని గుర్తు చేశారు.

స్వామినాథన్ కమిషన్ సభ్యుడు కామ్రేడ్ అతుల్ కుమార్ అంజన్ ఏకైక రైతు నాయకుడని, స్వామినాథన్ కమిషన్ నివేదికను రూపొందించడంలో ఆయన పాత్ర ఆధునిక భారతీయ వ్యవసాయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమన్నారు. ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారని.కార్యక్రమంలో మారోజు నరసిమాచారి, లింగస్వామి, ఎంగోజు ప్రశాంత్, అంజయ్య,మనీష్ తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

May 03 2024, 17:24

ప్రజల కోసం పోరాడేది ఎర్రజెండా మాత్రమే సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ కు ఓటేసి గెలిపించండి చెరుపల్లి సీతారాములు సిపిఎం కేంద్ర కమిటీ


భువనగిరి పార్లమెంటులో ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలకు లేదని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు అన్నారు

  ఈరోజు ఎన్నికల ప్రచారంలో మండల పర్యటనలో భాగంగా వలిగొండ మండల కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ నేడు పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది 

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం లో సిపిఎం అనేక ప్రజా పోరాటాలను నిర్వహించిందని కాంగ్రెస్, బిజెపి,టిఆర్ఎస్ పార్టీలు ప్రజల కోసం ఏం ఉద్యమాలు నిర్వహించారు తెల్పాలని అన్నారు ఎన్నికల్లో డబ్బు మద్యం విపరీతంగా పంచి గెలవాలని ఉద్దేశంతో ముందుకు వస్తున్నారని వారందరినీ ఓడించాలని ప్రజల కోసం పోరాడే సిపిఎం అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని కోరారు ఈ ప్రాంతం నుండి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,వెంకట్ రెడ్డి సోదరులు ఎంపీలుగా గెలిచిన నియోజకవర్గం అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేకపోయారని విమర్శించారు కాంట్రాక్టులు పైరవీలు తప్ప వీటివల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీగా గెలిచిన బూర నర్సయ్య గౌడ్ నాడు ప్రజలకు ఏమి చేయకుండా నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు చేశారని పదవి పోయిన తర్వాత వెంటనే పార్టీ మారి బిజెపిలోకి పోయి మళ్లీ బిజెపి అభ్యర్థిగా ముందుకు వస్తున్నారని ప్రజల కోసం ఏం చేశాడో ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అభ్యర్ధి ఎక్కడి నుండి వచ్చారో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న జహంగీర్ ఈ ప్రాంతంలో ఉన్న మూసి జల కాలుష్యం అరికట్టాలని జిల్లా వ్యాప్తంగా 10 రోజులపాటు బస్సు యాత్ర స్థానిక పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా నెలకొన్న స్థానిక సమస్యలు పరిష్కారం కోసం 1000 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారని పేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు పెన్షన్లు రేషన్ కార్డులు లాంటి అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించారని మిగతా పార్టీల అభ్యర్థులు ఒక్కరోజైనా ప్రజల కోసం రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారా అని ప్రశ్నించారు అందుకే ఈ ఎన్నికల్లో కేవలం ఓట్లు అడిగే నైతిక హక్కు సిపిఎంకు మాత్రమే ఉందని సిపిఎం అభ్యర్థి జహంగీర్ను ప్రజలందరూ ఆదరించి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు 

సిపిఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్లో సిపిఎం ఏర్పడ్డ నాటి నుండి పోటీ చేస్తుందని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులు చేసిన పోరాటాల ద్వారా ప్రజలకు అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయని గత 35 సంవత్సరాలుగా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పోరాడుతున్నానని ఒక అవకాశం ఇస్తే ఈ ప్రాంతంలో ఉన్న అనేక దీర్ఘకాలిక సమస్యలతో పాటు తాత్కాలిక సమస్యలను పరిష్కారం చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు ప్రజలందరూ ఒకసారి ఆలోచించి సిపిఎంకు ఈ ఎన్నికల్లో ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామంలో ప్రచారం ప్రారంభించి వెలువర్తి కెర్చిపల్లి, మొగిలిపక ,తుర్కపల్లి,గోపరాజుపల్లి వెంకటా పురం, గ్రామాల్లో పర్యటించమని తెలిపారు ప్రజల నుండి మంచి స్పందన లభించిందని కమ్యూనిస్టులు గెలవాలని ప్రజలందరూ భావిస్తున్నారని అన్నారు

ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ తీగల సాగర్ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య కొండమడుగు నరసింహ తప్పెట్ల స్కైలాబ్ బాబు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు కల్లూరి మల్లేశం దోనూరు నర్సిరెడ్డి దాసరి పాండు సిపిఎం మండల కార్యదర్శి సిరిఫంగి స్వామి జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్ మెరుగు వెంకటేశం కూర శ్రీనివాస్ కల్కూరి రామచందర్ మండల కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు వాకిటి వెంకటరెడ్డి ఏలే కృష్ణ కందడి సత్తిరెడ్డి కవిడే సురేష్ దుబ్బ లింగం కర్ణ కంటి యాదయ్య వేముల నాగరాజు దొడ్డి బిక్షపతి వేముల జ్యోతిబసు పల్చం లింగం ఉండ్రాటి పాపయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.

VijayaKumar

May 03 2024, 17:16

అవకాశవాద పార్టీలను ఓడించండి ,సిపిఎం ను ఆదరించి జహంగీర్ ని గెలిపించండి :దయ్యాల నరసింహ భువనగిరి సిపిఎం మండల కార్యదర్శి


మతోన్మాద బిజెపి నుంచి దేశాన్ని కాపాడుకుందాం అని సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ పిలుపునిచ్చారు.

ఈరోజు మండల పరిధిలోని తుక్కాపూర్ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ అదే విధంగా ఉపాధి హామీ కేంద్రాల్లో సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ గారి గెలుపు కొరకు ప్రచారం నిర్వహించారు.

 ఈ సందర్భంగా దయ్యాల నరసింహ మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా Md. జహంగీర్ పోటీ చేస్తున్నారని వారి గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు బ్యాలెట్ లో వరుస సంఖ్య 5 పై ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు.

 గత పది సంవత్సరాలుగా బిజెపి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు రైతంగ వ్యతిరేక చట్టాలను తీసుకురావడం వలన వందలాది మంది రైతులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటాలను చేసి అనేకమంది ప్రాణాలను కోల్పోయారని తెలిపారు .అంతేకాకుండా వామపక్ష పోరాట ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ చట్టంలోని కార్మికుల హక్కులను తుంగలో తొక్కుతూ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉపాధి హామీ కార్మికులకు ప్లేస్ స్లిప్పులు, మెడికల్ కిట్టు, టెంటు, త్రాగునీరు, పనిముట్లను కార్మికులకు తగ్గించారన్నారు. ఉపాధి హామీ కూలి రేటు రూ. 600 కు పెంచాలని సిపిఎం గా అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని అన్నారు ప్రజల సొమ్ముతో నిర్మించుకున్న ప్రభుత్వ. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీల కట్టబెడుతూ ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెంచడంతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని వీటన్నిటి ఫలితంగా ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ప్రజల దృష్టిని మరల్చడానికి కుల మతాలను ప్రేరేపిస్తూ ప్రసంగించడంతోపాటు ప్రజల్లో విద్వేషాలను పెంచి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అందుకే బీజేపీ ని అవకాశవాద పార్టీలైన కాంగ్రెస్ టిఆర్ఎస్ లను ఓడించి గత 35 సంవత్సరాలుగా అనేక ప్రజా ఉద్యమాలు నడిపిన ప్రజా పోరాటాల నాయకుడు నిస్వార్థ నాయకుడు ఎండి జహంగీర్ గారిని గెలిపించి పోరాడే వారికే ఆయుధం ఇవ్వాలని నరసింహ పిలుపునిచ్చారు

 *ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, మాజీ మండల కమిటీ సభ్యులు వడ్డెబోయిన వెంకటేష్, మండల కమిటీ సభ్యులు కొండపురం యాదగిరి, తుక్కాపూర్ శాఖ కార్యదర్శి గుండెనబోయిన దానయ్య, బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

  

VijayaKumar

May 03 2024, 17:08

సిపిఎం అభ్యర్థి జహంగీర్ గెలుపుకై గోపరాజుపల్లి లో విస్తృత ప్రచారం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజు పల్లి గ్రామంలో భువనగిరి సిపిఎం పార్టీ అభ్యర్థి ఎండి జహంగీర్ గెలుపుకై గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ సిపిఎం అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలని కోరారు. అనంతరం గ్రామ రచ్చబండ వద్ద సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి ఎనుగుల నరసింహ అధ్యక్షతన ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మండల సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు గాజుల ఆంజనేయులు మాట్లాడుతూ అను నిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రజల కోసం పోరాడే నాయకుడు జహంగీర్ అని అన్నారు. సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సిపిఎం పార్టీ అభ్యర్థి ఎండి జహంగీర్ మాట్లాడుతూ ఈ ప్రాంత వాసిని , కమ్యూనిస్టులు ఏదైతే హామీ ఇస్తారో అది అమలు చేస్తారు. కొంతమంది కాంగ్రెస్ ,బిజెపి రాజకీయ నాయకులు అమలు గాని హామీలను ఇచ్చి ప్రజలను మోసిగించారని అన్నారు. కూలి రేట్లు పెంచింది ,కరువు పని తెచ్చింది కమ్యూనిస్టులు అని అన్నారు. ప్రజల్లో ఉంటున్నాము గెలిస్తే ప్రజల్లో ఉంటూ మరికొన్ని పనులు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు మాటూరి బాలరాజు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అవనగంటి వెంకటేశం, ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, సురేందర్, సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, గ్రామ సిపిఎం కార్యకర్తలు గాజుల మల్లయ్య, గాజుల వెంకటేశం, సలిగంజి నరసింహ, మంద సంజీవ, సలిగంజి రాజయ్య , ఏటేల్లి నరసింహ, గాజుల లక్ష్మమ్మ సలిగంజి పద్మ, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

May 03 2024, 17:03

అరూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ఇంటింటికి ప్రచారం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ని గెలిపించాలని కోరుతూ ఇంటింటికి ప్రచారం చేస్తూ పనికి ఆహార పథకం దగ్గర దాదాపు 200 మంది మహిళలతో మాట్లాడిన సందర్భంగా ఈ దేశంలో పేదరిక నిర్మూలన కుల మతాలు లేని సమ సమాజం ఒక కాంగ్రెస్ తోనే సాధ్యం అని అన్నారు ఈ దేశం కోసం శ్రీమతి ఇందిరా రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

VijayaKumar

May 02 2024, 19:35

పదవ తరగతి ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి: కొడారి వెంకటేష్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు


 

తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా, 25 వ స్థానానికి పరిమితం కావడం చాలా ఆందోళన కలిగించే అంశమని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా లోని సూర్యాపేట 06 వ స్థానంలో, నల్లగొండ 09 వ స్థానంలో ఉండగా, యాదాద్రి భువనగిరి జిల్లా 25 వ స్థానంలో ఉండడం తల్లిదండ్రులను, బాలల హక్కుల సంఘం నాయకులను బాధించే అంశమని ఆయన అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా లో మొత్తం 9,108 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయగా 8,237 మంది విజయం సాధించారని, 871మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారని ఆయన అన్నారు. కేవలం 39 ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే వంద శాతం ఉత్తీర్ణత రావడం చాలా విచారకరమని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుటకు, మార్కుల శాతం ను పెంచుటలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని ఆయన అన్నారు. తుర్కపల్లి మండలం గందమల్ల ప్రభుత్వ పాఠశాలలో 14 మంది విద్యార్థులు పదవతరగతి పరీక్షలు రాయగా కేవలం ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణత సాధించడం చాలా బాధాకరమైన విషయమని ఆయన అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యను అందించాలని ప్రభుత్వం గత సంవత్సరం జులై నెలలో పోచంపల్లి మండలం లోని పోచంపల్లి,జూలూరు, ఇంద్రియాల, వంక మామిడి హైస్కూల్లల్లో సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు చేసి 8,9,10 తరగతుల విద్యార్థులకు 75 ఇంచుల ఎల్ ఈ డి స్క్రీన్ పై డిజిటల్ విద్యను అందించారు. ఐనా ఆ మండలంలో మొత్తం 41 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాదించక పోవడం విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. పేద, మద్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాద్యాయులు, విద్యాశాఖ అధికారులు విద్యను సక్రమంగా అందించని కారణంగానే యాదాద్రి భువనగిరి జిల్లా, రాష్ట్ర స్థాయిలో విద్యలో వెనుకబడి పోయిందని, భవిష్యత్తులో ఇలాంటి ఫలితాలు రాకుండా చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు రావడానికి కృషి చేయాలని ఆయన కోరారు.

VijayaKumar

May 02 2024, 19:30

వలిగొండ మండల కేంద్రంలో వాహనాల తనిఖీలో రూ.1.66 లక్షలు సీజ్ ; వలిగొండ ఎస్సై డి మహేందర్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్ వద్ద పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా వలిగొండ పోలీసులు గురువారం వాహనాలు తనిఖీలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామానికి చెందిన కొమ్మిడి వెంకట్ రెడ్డి తండ్రి నర్సిరెడ్డి వద్ద టు వీలర్ లో  సరైన ఆధారాలు లేని రూ. 1,66,000 నగదును పట్టుకున్నారు. ఈ నగదును సీజ్ చేసి డిటిఓ యాదాద్రి భువనగిరి జిల్లా యందు డిపాజిట్ చేశామని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు.

VijayaKumar

May 02 2024, 15:14

చౌటుప్పల్ లో సమాచార హక్కు చట్టం - 2005 అవగాహన సదస్సులో పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి.

ఈ సందర్భంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ....

భువనగిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సమాచార హక్కు చట్టం సంబంధించిన అవగాహన సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.సమాచార హక్కు చట్టాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చినది.ఈ చట్టాన్ని కాపాడాలని మార్గదర్శకం తో ప్రభుత్వం నడవాలని మీరందరూ ఒక సమిష్టిగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు.గత పది సంవత్సరాలుగా భారతదేశంలో గానీ మన రాష్ట్రంలో చీకటి జీవోలను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన జీవోలు ప్రజలకు తెలవకుండా అధికారాన్ని చలాయించి లక్షల కోట్ల అప్పు చేసి ప్రజలపై మోపారు.. సమాజం కోసం మంచి చేయాలని ఆలోచనతోటి ఈ కార్యక్రమాలను చేస్తున్నందుకు ఆర్టిఐ సభ్యులకు ధన్యవాదాలు. స్వచ్ఛందంగా ప్రజలకు మంచి జరగాలని మార్గదర్శకంగా ప్రభుత్వాలు పనిచేయాలని ప్రజలను మభ్యపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించి విధంగా ఉండకుండా ప్రజలు అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వాలు ఉండాలి అని తెలిపారు.ప్రతి జీవోను కూడా ప్రజలకు తెలియజేసే విధంగా వాస్తవాలను తెలిసే విధంగా ఉండాలి అని,గతంలో కాంగ్రెస్ పార్టీ సమాచార హక్కు చట్టాన్ని  ప్రవేశపెట్టిందని అన్నారు . ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాచారం చైర్మన్ డా.వర్రె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

May 02 2024, 15:08

ప్రచారంలో దూసుకుపోతున్న "కమలం "నాగారం లో ఇంటింటికి,విస్తృత ప్రచారం

భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నాగారం గ్రామంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న బీజేపీ నాయకులు ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే కావున భువనగిరి పార్లమెంట్లో బూర నర్సయ్య గౌడ్ ను అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ద్వారా పాట్లమెంట్ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ క్షేత్ర స్థాయిలో అందుతాయని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మండల అద్యక్షులు బోల్ల సుదర్శన్,మాజీ మండల అద్యక్షులు నాగెల్లి సుధాకర్ గౌడ్,జిల్లా కార్య వర్గ సభ్యులు భచ్చు శ్రీనివాస్ ,మహిళా మౌర్చ కార్యదర్శి మందుల లక్ష్మి,మండల ప్రధాన కార్యదర్శులు మారోజూ అనిల్ కుమార్, లోడే లింగ స్వామి,మండల ఉపాధ్యక్షులు గంగదారి దయాకర్,మండల కోశాధికారి అప్పి శెట్టి సంతోష్,మండల కార్యదర్శి మందుల నాగరాజు , ఓబీసీ మోర్చ మండల అద్యక్షులు వెలిమినేటి వెంకటేష్, BJYM మండల అద్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి,BJYM అసెంబ్లీ కన్వీనర్ బుంగమట్ల మహేష్,పోలు నాగయ్య,డాక్టర్ లక్ష్మణ్, బూత్ అద్యక్షులు కట్ట బిక్షం, పుండరీకం ,బర్ల మల్లేశం మండలూజు శ్రీనివాస్ చారి బర్ల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

May 01 2024, 20:09

మోడీ, అమిత్ షా తాటాకు చప్పుల్లకు రేవంత్ రెడ్డి భయపడడు: అతహర్


ఢిల్లీ పోలీసులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఢిల్లీ కు రావాలని నోటీసులు ఇవ్వడం పై కాంగ్రెస్ నాయకులు అతహర్ మండిపడ్డారు. ఈ సందర్బంగా అతహర్ మీడియా తో మాట్లాడుతూ మొన్నటి వరకు అమిత్ షా, మోడీ లు ఈడి, సిబిఐ లతో ముఖ్యమంత్రులను బయపెట్టాలని చూశారని నేడు ఢిల్లీ పోలీసులను హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు పంపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి నోటీసులు ఇస్తే ఇక్కడ భయపడే వారు ఎవ్వరు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఆటలు ఇక కేవలం నెల రోజులు మాత్రమేనని జూన్ 4 వ తేది రోజు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ లో బిఆర్ఎస్ కు పట్టిన గతే కేంద్రం లో బీజేపీ కి పట్టడం ఖాయం అని అన్నారు. సెమిఫైనల్ లో కెసిఆర్ ను ఓడించి గద్దె దించింది కాంగ్రెస్ పార్టీ అని ఫైనల్ లో మోడీ ని కూడా గద్దె దించేది కూడా కాంగ్రెస్ పార్టీ నే అని ధీమా వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా బీజేపీ కూటమికి ఎదురు గాలి వీస్తుందని ఇప్పటికే పలు సర్వేలు చెప్పడం తో మోడీ, అమిత్ షా దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. భువనగిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక మెజారిటీ గెలవడం ఖాయం అని తెలిపారు.